తిరుపతి లో గంజాయి డోర్ డెలివరీ చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 22 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.నగరి మండలం ఓజీ కుప్పానికి చెందిన యువకుడు … చెడు వ్యసనాలకు అలవాటు పడ్డారు. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో గంజాయి రవాణా చేయడంతో పాటు విక్రయాలు చేస్తున్నారు. తిరుపతి ఏజెన్సీలో గంజాయిని కిలో రూ.
10 వేలకు కొని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి రూ. 300కు అమ్ముతున్నారు. గంజాయి కావాలని ఫోన్ చేస్తే స్విగ్గీ బాయ్గా వెళ్లి విక్రయాలకు పాల్పడుతున్నారు. పక్కా సమాచారంతో తిరుపతి మారుతీనగర్ కొత్తపల్లి క్రాస్ వద్ద నిఘా పెట్టి అతన్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.