*పేద విద్యార్థినికి ఎమ్మెల్యే చేయూత*
*-ఉన్నత చదువుకు 25వేలు ఆర్ధిక సహాయం చేసిన పాశిం సునీల్ కుమార్*
గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన మల్లి శ్రావణి కి ఎంసీఏ మొదటి సంవత్సరం ఫీజు 25వేలు రూపాయలు ను గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ దాతృత్వంతో తెలుగు మహిళ నాయకురాలు మట్టం శ్రావణి రెడ్డి వారికి అందించారు.మట్టం శ్రావణి మాట్లాడుతూ తండ్రిని కోల్పోయి చదుకునే స్తోమతలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న మల్లి శ్రావణి కుటుంబానికి అండగా పాశిం సునీల్ కుమార్ నిలచరన్నారు,ఈసందర్భంగా విద్యార్థిని మల్లి శ్రావణి ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కి ధన్యవాదాలు తెలియచేశారు.