స్వర్ణముఖి నది పొర్లు కట్టడాలు మరియు పిచ్చి పనులు వెంటనే ప్రారంభించాలి- గూడూరు సబ్ కలెక్టర్


*స్వర్ణముఖి నది పొర్లు కట్టలు, బ్రిడ్జి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి సబ్ కలెక్టర్*

తిరుపతి జిల్లా వాకాడు మండలంలోని బాలిరెడ్డి పాలెం వద్ద గత సంవత్సరం తుఫాన్ వల్ల తెగిన స్వర్ణముఖ నది పొర్లు కట్టలు పనులు మరియు బ్రిడ్జి నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం సబ్ కలెక్టర్ స్వర్ణముఖి నదికి పడిన గండ్లను ఆకస్మికంగా పరిశీలించారు. టెండర్లు పూర్తయిన నిర్మాణ పనులు ఎందుకు ప్రారంభించలేదని ఇరిగేషన్ అధికారులను ప్రశ్నించారు.వారం రోజుల్లోగా పనులు ప్రారంభం కావాలని ఆదేశించారు. సబ్ కలెక్టర్ వెంట ఇరిగేషన్ అధికారులు ఉన్నారు.*

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements