తిరుపతి లో ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు


చెర్లోపల్లి మీదుగా అడవిలోకి చొరబడు తున్న 10 మంది అరెస్టు
7 పిడి లేని గొడ్డళ్లు, కారు, మోటారు సైకిల్ స్వాధీనం

తిరుపతి అలిపిరి రోడ్డు మార్గం లో చెర్లోపల్లి వద్ద శేషాచలం అడవుల్లో కి ప్రవేశిస్తున్న 10 మందిని అరెస్టు చేయడంతో పాటు వారి నుంచి 7 పిడిలేని గొడ్డళ్లు, వారు ప్రయాణించిన కారు, ఒక మోటారు సైకిల్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఇంచార్జి, తిరుపతి జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు, టాస్క్ ఫోర్స్ ఎస్పీ కె. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్ ఐ కె. సురేష్ కుమార్ రెడ్డి కి చెందిన ఆర్ ఎస్ ఐ టీ. విష్ణు వర్ధన్ కుమార్ టీమ్ తిరుపతి అర్బన్ అటవీప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. శనివారం ఉదయం అలిపిరి రోడ్డు మీద చెర్లోపల్లి వద్ద కొంతమంది కారులో దిగుతున్నారు. వారిని సమీపించి చుట్టుముట్టగా, వారు ఎర్రచందనం కోసం అడవుల్లోకి వెళుతున్నట్లు తెలిసింది. దీంతో వారిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి 7పిడిలేని గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. వారిని తమిళనాడు తిరువన్నామలై జిల్లా కు చెందిన బాబు (30), బాల మురుగన్ (27), ప్రభు (31), కందస్వామి (24), రమేష్ (30), కృష్ణ మూర్తి (45), మణికంఠ (20), కార్తీ (27), రామ్ కుమార్ (31) రజనీకాంత్ (28)లుగా గుర్తించారు. పారిపోయిన ఒకరి కోసం గాలిస్తున్నారు. వీరిని టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. సీఐ సురేష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Comment

Recent Post

Live Cricket Update

Advertisements