ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం.. ట్విస్ట్ ఇచ్చిన
నిందితుడు
కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనలో
నిందితుడైన సంజయ్ రాయ్ CBI కోర్టులో సంచలన
ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. పాలీగ్రాఫ్ టెస్టుకు
ఎందుకు సమ్మతించావని మెజిస్ట్రేట్ ప్రశ్నించగా..
అతడు భావోద్వేగానికి గురైనట్లు తెలిసింది.
‘నేను అమాయకుడిని. ఏ తప్పూ చేయలేదు.
నన్ను ఇరికించారు. ఈ పరీక్షతో అసలు విషయం
బయటపడుతుంది’ అని జడ్జి ముందు కన్నీళ్లు
పెట్టుకున్నట్లు సమాచారం. దీంతో ఈ కేసులో ట్విస్ట్
నెలకొంది.